Sunday, April 28, 2024

TS: సూర్యాపేట‌లో ఐటీ హ‌బ్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ సూర్యాపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఐటీ హ‌బ్‌ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డితో క‌లిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఐటీ కంపెనీల ప్ర‌తినిధుల‌తో, ఉద్యోగాలు పొందిన యువ‌త‌తో మంత్రులు కేటీఆర్, జ‌గ‌దీశ్ రెడ్డి ముచ్చ‌టించారు.

ఐటీ హ‌బ్‌లో గాంధీజీ చిత్ర‌ప‌టానికి కేటీఆర్ పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో రాజ్య‌స‌భ ఎంపీ బ‌డుగుల లింగ‌య్య యాద‌వ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జ‌డ్పీ చైర్మ‌న్‌లు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement