Friday, April 26, 2024

అంబేద్కర్ నగర్‌లో నాడు- నేడు.. 330 డబుల్‌ బెడ్‌ రూమ్ ఇళ్లు

గ్రేటర్ హైదరాబాద్‌లో దశల వారిగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ప్రారంభం అవుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఇళ్లను లబ్ధిదారులకు అందించారు. తాజాగా శనివారం పీవీ మార్గ్ అంబేద్కర్ నగర్‌లో జీహెచ్ఎంసీ నిర్మించిన 330 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను మంత్రులు కేటీఆర్, తలసాని ప్రారంభించారు. లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసి, ఇండ్ల తాళాలు అందజేశారు. కాగా, నగరవాసుల కోసం ప్రభుత్వం రూ.28 కోట్లతో 330 డబుల్‌ బెడ్‌ రూమ్ ఇళ్లను నిర్మించిన విషయం తెలిసిందే. ఒక్కో ఇంటిపై రూ. 8.50 లక్షలు ఖర్చు చేసి సకల సదుపాయాలతో కూడిన విలాసవంతమైన ఇళ్లను నిర్మించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement