Thursday, May 9, 2024

KTR : తెలంగాణ గడ్డ.. చైతన్యానికి అడ్డ

దేశంలోనే ఎక్కడ లేని విధంగా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న తెలంగాణకు వచ్చి… కర్ణాటకలో 5 గంటలు కరెంట్ ఇస్తున్నామని గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటు అని, అది మీ చేతకానితనానికి నిదర్శనమని మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామ‌రావు దుయ్యబట్టారు. డీకే శివ కుమార్ వ్యాఖ్యలపైమంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు.

మీ మాటలు నమ్మటానికి ఇది కర్ణాటక కాదని.. తెలంగాణ గడ్డ అంటూ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ కు అధికారం ఇస్తే.. అంధకారమే అని కర్ణాటక దుస్థితిని చూసి తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయిందన్నారు. మీ వైఫల్యాలను చూడటానికి కర్ణాటక వరకు వెళ్లాల్సిన అవసరం లేదని మీ చేతిలో దగా పడ్డ అక్కడి రైతులే.. ఇక్కడికి వచ్చి మీరు చేసిన అన్యాయాన్ని వివరిస్తున్నారని ఎద్దెవా చేశారు. తెలంగాణ రైతులకు కాంగ్రెస్ నుంచి పొంచి ఉన్న ప్రమాదంపై హెచ్చరిస్తున్నారని ఉద్ఘాటించారు. ఓవైపు కర్ణాటక ప్రజలు పుట్టెడు కష్టాలతో పడరాని పాట్లు పడుతుంటే పట్టించుకోకుండా తెలంగాణలో ఓట్ల వేటకొచ్చారా.. ? అంటూ ప్ర‌శ్నించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన మిమ్మల్ని కర్ణాటక ప్రజలు క్షమించరని, తెలంగాణ ప్రజలు విశ్వసించ‌ర‌ని ఖ‌రా ఖండిగా చెప్పారు. ఎన్నికల ప్రచారంలో ఐదు హామీలు అని అరచేతిలో వైకుంఠం చూపించారని, తీరా గద్దెనెక్కిన తరువాత సవాలక్ష కొర్రీలతో ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని ఘాటు వాఖ్య‌లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement