Monday, May 6, 2024

ADB: బాసర వసంత పంచమి ఉత్సవ వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన మంత్రి

బాసర, జనవరి 31( ప్రభ న్యూస్): నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి సన్నిధిలో ఈ నెల 12 నుండి 14 వరకు వసంత పంచమి ఉత్సవాలు నిర్వహించనున్నారు. బుధవారం హైదరాబాదులోని సచివాలయంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.

ఉత్సవాలకు రావాలని మంత్రిని రాష్ట్ర దేవదాయ కమిషనర్ను ఆలయ అధికారులు వైదిక సిబ్బంది ఆహ్వానించారు. ఉత్సవాల నిర్వాహణకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆలయ అధికారులకు మంత్రి సూచించారు. అంతకుముందు మంత్రి కొండ సురేఖను ఆలయ ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి, వేద పండితులు నవీన్ శర్మ వేదమంత్రాలతో ఆశీర్వదించి ఆలయ ఈవో విజయరామారావు అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, అదనపు కమిషనర్ జ్యోతి, వరంగల్ జోన్ కమిషనర్ శ్రీకాంత్ రావు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement