Tuesday, April 30, 2024

పీహెచ్ సీ వ‌ర్క‌ర్ల నియామ‌క ప్ర‌క్రియ నిలిపివేత – క‌లెక్ట‌ర్ కు ఆదేశాలు చేసిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

నిర్మ‌ల్ ప్రతినిధి – ప్రభా న్యూస్ : నిర్మ‌ల్ మున్సిపాలిటీలో పీహెచ్ సీ వ‌ర్క‌ర్ల నియామ‌క ప్ర‌క్రియను నిలిపి వేస్తున‌ట్లు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప్ర‌క‌టించారు. క్యాంప్ ఆఫీస్ లో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ … నిర్మ‌ల్ మున్సిపాలిటీలో పీహెచ్ సీ వ‌ర్క‌ర్ల నియామ‌కాల్లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగియంటూ గ‌త కొన్ని రోజులుగా ఆరోప‌ణ‌లు వ‌స్తున్న‌ నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు మంత్రి తెలిపారు. దీనిపై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపి నివేదిక స‌మ‌ర్పించాలంటూ క‌లెక్ట‌ర్ కు ఆదేశాలిచ్చిన‌ట్లు చెప్పారు. నివేదిక అందిన వెంట‌నే దాన్ని ప‌రిశీలించి త‌దుప‌రి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement