Wednesday, April 24, 2024

ప్రధాని మోడీ దుర్మార్గుడు : ఎమ్మెల్యే బాల్క సుమన్ ఘాటు వ్యాఖ్యలు

ప్రధాని నరేంద్ర మోడీ దుర్మార్గుడు అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. హైదరాబాద్ పర్యటన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన విమర్శలపై టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. తాజాగా, మోదీపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ దుర్మార్గుడని, తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేశారని మండిపడ్డారు. గంగా నది ప్రక్షాళనకు నమామి గంగ ప్రాజెక్టు చేపట్టినా దానికి అతీగతీ లేదన్నారు. బీజేపీలో చాలా చోట్ల పరివార్ పాలన నడుస్తోందన్నారు. గల్లీ క్రికెట్ కూడా ఆడని జైషా బీసీసీఐలో కీలకంగా ఎలా ఉన్నాడని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement