Sunday, April 28, 2024

ప్రారంభానికి సిద్ధమైన మాతాశిశు కేంద్రం-ప్రారంభించ‌నున్న మంత్రి హ‌రీశ్ రావు

పెద్దపల్లి ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. జిల్లా కేంద్రంలో నిర్మించిన మాతా శిశు కేంద్ర పనులు పూర్తయ్యాయి. మే 4వ తేదీన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మాతా శిశు కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. వంద పడకల తో పాటు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. మాతా శిశు కేంద్రంతో నియోజకవర్గ ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి రానుందని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement