Friday, March 29, 2024

Flash: దుండిగల్‌లో మహిళపై గ్యాంగ్ రేప్

తెలుగు రాష్ట్రాల్లో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తెచ్చిన మృగాల్లో మార్పు రావడం లేదు. తాజాగా హైదరాబాద్‌ నగర శివార్లలోని దుండిగల్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రెండు రోజుల క్రితం ఓ మహిళ ఉపాధి నిమిత్తం షోలాపూర్‌ నుంచి దుండిగల్‌ వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి ఆమెను గండిమైసమ్మలోని బార్‌ వెనక ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లిన యువకులు.. సామూహికంగా లైంగిక దాడి చేశారు. మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులను దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా ఉన్న బస్తీకి చెందిన నరసింహ, ఇమామ్‌, కుద్దుస్‌, ఉమృద్దిన్‌గా గుర్తించారు. వాళ్లంతా ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement