Sunday, April 28, 2024

హుజురాబాద్ లో గులాబీ దండు.. హరీష్ బైక్ ర్యాలీ

హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరు అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో గులాబీ పార్టీలో జోష్ వచ్చింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల ఇంచార్జ్ గా ఉన్న మంత్రి హరీష్ రావు నియోజకర్గంలో భారీ ర్యాలీతో ఎంట్రీ ఇచ్చారు. మంత్రి గంగుల కమాలాకర్ తోపాటు కార్యకర్తలతో కలిసి కేసీ క్యాంప్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ముందుగా అమరవీరుల స్థూపం వద్ద మంత్రి గంగులతో కలిసి నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అక్కడి నుండి జమ్మికుంట మీదుగా బైక్‌ ర్యాలీతో ఇల్లంతకుంట చేరుకున్నారు.

 
Advertisement

తాజా వార్తలు

Advertisement