Sunday, April 28, 2024

ఎమ్మెల్యే రాజయ్యకు మంత్రి ఎర్రబెల్లి పరామర్శ

జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలోని నిర్మలమాత దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య మాతృమూర్తి తాటికొండ లక్ష్మీ జ్ఞాపకార్ధ కూడిక కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరైయ్యారు. ఈ సందర్భంగా తాటికొండ లక్ష్మీ చిత్రపటానికి మంత్రి ఎర్రబెల్లి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే డా.రాజయ్య, సోదరుడు సురేష్ కుమార్, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ప్రేమవిందు కార్యక్రమంలో  పాల్గొన్నారు. ఆయన వెంటా జడ్పి చైర్మన్ పాగల సంపత్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement