Sunday, April 28, 2024

ఎమ్మెల్యే రాజయ్యని పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి

మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే డాక్టర్.తాటికొండ రాజయ్య మాతృమూర్తి తాటికొండ లక్ష్మీ అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో  మంత్రి ఎర్రబెల్లి ఎమ్మెల్యే రాజయ్య నివాసానికి వెళ్లి తాటికొండ లక్ష్మి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ తోపాటు టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement