Friday, May 10, 2024

పాల‌ల్లో న‌ల్ల ఉప్పు క‌లిపి తాగి ఒక‌రు మృతి

క‌రోనా సోక‌కూడ‌ద‌ని ఒక‌రు పాల‌ల్లో న‌ల్ల ఉప్పు క‌లిపి తాగి మ‌ర‌ణించారు. ఈ సంఘ‌ట‌న సికింద్రాబాద్ ప‌రిధిలోని మ‌చ్చ‌బొల్లారం లో చోటు చేసుకుంది.

మ‌చ్చ‌బొల్లారానికి చెందిన సురేశ్‌, ఆయ‌న భార్య సంధ్య‌, త‌ల్లి ల‌క్ష్మీ.. క‌రోనా రాకూడ‌ద‌ని ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ఆ కుటుంబానికి ఓ వ్య‌క్తి ప‌రిచ‌యం అయ్యాడు. పాల‌లో న‌ల్ల ఉప్పు క‌లిపి తాగితే క‌రోనా రాద‌ని చెప్పాడు.

దీంతో ఈ నెల 9న సురేశ్ దంప‌తుల‌తో పాటు త‌ల్లి ల‌క్ష్మి పాల‌లో న‌ల్ల ఉప్పు క‌లిసి తాగారు. కాసేప‌టికి భ‌ర్త సురేశ్‌, భార్య సంధ్య‌, త‌ల్లి ల‌క్ష్మి తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఈ ముగ్గురికి వాంతులు తీవ్రం కావ‌డంతో చికిత్స నిమిత్తం స్థానికులు య‌శోద ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. సురేశ్ చికిత్స పొందుతూ నిన్న మృతి చెందాడు. మృతుడి భార్య, త‌ల్లి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement