Friday, May 3, 2024

బ‌డుల్లో ముక్కిపోతున్న మ‌ధ్యాహ్న బియ్యం..

విద్యా, పౌరసరఫరాల శాఖ మధ్య సమన్వయ లోపంతో బియ్యం ఖరాబు
విద్యాసంస్థలకు వేసవి, కరోనా సెలవులు వచ్చినప్పటికీ తరలించని వైనం
గత ఏడాది సీన్‌ మళ్లీ రిపీట్‌

హైదరాబాద్‌, : రాష్ట్రంలో మధ్యాహ్న భోజనానికి కేటాయించిన బియ్యం ముక్కిపోతు న్నాయి. ఒక వైపు విద్యాసంస్థలు మూతబడి విద్యా ర్థులకు మధ్యాహ్న భోజనం అందని పరిస్థితి.. మరో వైపు మధ్యాహ్న భోజనానికి కేటాయించిన బియ్యం పాఠశాలల్లో ముక్కిపోతున్న దుస్థితి. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా వందల క్వింటాళ్ల బియ్యం ఎందుకు పనికిరాకుండా పోయే ప్రమాదం ఉంది. గతేడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కూడా విద్యాశాఖాధికారులు
మేల్కొనకపోవడం గమనార్హం. వాస్తవానికి పాఠశాలలు మూతపడే సమయానికి ఆయా బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ ద్వారా రేషన్‌ దుకాణాలకు తరలించాల్సి ఉంటుంది. కానీ విద్య, పౌరసరఫరాల శాఖల మధ్య సమన్వయం కొరవడ డంతోనే నెలన్నరగా బస్తాలు పేరుకుపోయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో ఉపాధ్యాయులు సైతం పాఠశాలలకు వెళ్లడం లేదు. దీనివల్ల బియ్యం ఎలా ఉన్నాయో కూడా అంతుచిక్కకుండా మారింది. ముఖ్యంగా నగర శివా రులోని గ్రామాల్లో పందికొక్కుల పాలయ్యే అవకాశం కూడా ఉంది. అయితే ఈ విషయాన్ని ప్రధానోపాధ్యాయులు కొంత మంది అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, బియ్యం తరలించే ఏర్పాట్లు చేయలేదని సమాచారం. వాటిని రేషన్‌ దుకాణాలకు తరలించే విషయంలో రెండు శాఖలు తాత్సారం చేస్తున్నా యని గుసగసలు వినబడుతున్నాయి. ”నిత్యం ప్రతి విద్యార్థికి 150 గ్రాముల బియ్యం చొప్పున ఇవ్వాలి. ఆ మేరకు లెక్కగట్టి సెలవుల్లో విద్యార్థులకే నేరుగా ఇచ్చే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి వివరించాం. విధాన పరంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున ఆ దిశగా ప్రభుత్వం యోచన చేయడం లేదు.’ అని ప్రధానోపాధ్యాయుడు ఒకరు చెప్పారు.
3500 క్వింటాళ్లు..
కరోనా రెండో దశ ఉద్ధృతి దృష్ట్యా మార్చి మూడో వారం నుంచి తెలంగాణలో విద్యా సంస్థలు మూతపడ్డాయి. తొలుత ఫిబ్రవరి ఒకటి నుంచి 9, 10 తరగతులకు ప్రత్యక్ష బోధన ప్రారంభం కాగా, మార్చి 1 నుంచి 6-8 తరగతుల విద్యార్థులను పాఠశాలలకు వచ్చేందుకు ప్రభుత్వం అనుమ తించింది. ఈ క్రమంలో మధ్యా#హ్న భోజన కార్యక్రమం కోసం ప్రభుత్వం సన్నబియ్యం సరఫరా చేసింది. మార్చి, ఏప్రిల్‌ నెలలకు సంబంధించి బియ్యాన్ని ముందుగానే పాఠశా లలకు తీసుకువచ్చారు. కరోనా రెండో దశ కారణంగా విద్యాసంస్థలు మళ్లి మూతపడడంతో మధ్యా#హ్న భోజన కార్యక్రమం నిలిచిపోయింది. ఇందుకు కేటాయించిన బియ్యం పాఠశాలల్లోనే ఉండిపోయాయి. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని 576 పాఠశాలల్లో దాదాపు 3500 క్వింటాళ్ల బియ్యం నిల్వలు పేరుకుపోయినట్టు సమాచారం. ప్రస్తుతం కరోనా రెండో దశ దృష్ట్యా పాఠశాలలు ఎప్పటికీ తెరుచుకుం టాయో తెలియని పరిస్థితి. నిల్వలు నెలల తరబడి ఉంచితే ముక్కిపోయి వృథా కానున్నాయి. గతేడాది కరోనా కారణ ంగా బియ్యం పాడైనా.. మళ్లిd అదే తీరు.. గతేడాది సైతం మార్చి లో లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. అప్పట్లోనూ బియ్యం నిల్వల తరలింపునకు అధికారులు చొరవ తీసుకోకపోవడంతో దాదాపు ఆరేడు నెలలు పాఠశాలల్లోనే పేరుకుపోయి ముక్కి పోవడంతో పాటు చాలాచోట్ల పందికొక్కుల పాలయ్యాయి. గతంలో రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో 1.78 లక్షల కిలోల బియ్యం పాడయ్యాయని సమాచారం. ఇప్పుడు మరోసారి అదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు మేల్కొని పాఠశాలల్లోని బియ్యం నిల్వలను వెనక్కి తీసుకుని రేషన్‌ దుకాణాలకు పంపించే ఏర్పాట్లు చేయాలని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement