Friday, April 26, 2024

స‌రికొత్త రికార్డ్ నెల‌కొల్పిన మెట్రో రైల్-ఒక్క‌రోజే నాలుగు ల‌క్ష‌ల మంది ప్ర‌యాణికులు

గ‌ణేశ్ శోభాయాత్ర సంద‌ర్భంగా నిన్న పెద్ద సంఖ్య‌లో జ‌నం హుస్సేన్ సాగ‌ర్‌కు వ‌చ్చిన నేప‌థ్యంలో భ‌క్తుల సౌక‌ర్యార్థం శుక్ర‌వారం అర్థ‌రాత్రి దాకా మెట్రో సేవ‌లు న‌డిచాయి. ఈ కార‌ణంగా ఒకే రోజు అత్య‌ధిక సంఖ్య‌లో జ‌నం ప్ర‌యాణించిన విష‌యంలో హైద‌రాబాద్ మెట్రో న‌యా రికార్డుల‌ను న‌మోదు చేసింది. శుక్ర‌వారం ఒక్క‌రోజే హైద‌రాబాద్ మెట్రోలో ఏకంగా 4 ల‌క్ష‌ల మంది ప్ర‌యాణించిన‌ట్లుగా అధికారులు తెలిపారు. మియాపూర్‌- ఎల్బీ న‌గ‌ర్ కారిడార్‌లో 2.46 ల‌క్ష‌ల మంది ప్ర‌యాణించ‌గా… నాగోల్‌- రాయ‌దుర్గం కారిడార్‌లో 1.49 ల‌క్ష‌ల మంది ప్ర‌యాణించారు. జేబీఎస్‌- ఎంజీబీఎస్ కారిడార్‌లో 22 వేల మంది ప్ర‌యాణించారు. ఇక ఆయా స్టేష‌న్ల‌లో ప్ర‌యాణికుల వివ‌రాల్లోకెళితే… అత్య‌ధికంగా 22 వేల మంది ఖైర‌తాబాద్ స్టేష‌న్‌లో రైలు ఎక్కితే… 44 వేల మంది ఆ స్టేష‌న్‌లో రైలు దిగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement