Sunday, May 5, 2024

చండీయాగంలో తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు. హవేలీ ఘనపురం మండలంలోని ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో శ్రీ సహస్ర చండీయాగం ప్రారంభమైంది. హవేలీ ఘనపూర్ మండల పరిధిలోని కూచనపల్లిలో ఎమ్మెల్సీ నిర్వహిస్తున్న చండీ యాగానికి శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం యాగశాలలో శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి పూజలు నిర్వహించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement