Saturday, July 27, 2024

MDK: రోడ్డుప్ర‌మాదంలో ఒకరు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం…రోడ్డుపై బైఠాయించి నిర‌స‌న

అక్కన్నపేట, జూన్ 10 (ప్రభ న్యూస్) : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని అక్కన్నపేట మండల కేంద్రంలో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, ఇద్దరికి తీవ్రగాయాలు కాగా.. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

పంతులు తండాకు చెందిన కరంత్తోతు కవిత, స్వరూప, రాజు జీవనోపాధి నిమిత్తం కూలీ పనికి బైక్ పై వెళుతుండగా.. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొట్టడంతో కవిత అక్కడికక్కడే మృతిచెందగా.. భార్యాభర్తలు రాజు, స్వరూప ల పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు.

తమకు న్యాయం చేయాలంటూ గిరిజన సంఘాలు రెండు గంటలపాటు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి శాంతింపజేశారు. అనంతరం మృతదేహాన్ని హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement