Wednesday, July 24, 2024

Modi – 100 డేస్ ​ప్లాన్​ రెడీ … నేడే మోదీ తొలి కేబినెట్ భేటి..

కేం‍ద్రంలో కొత్త కేబినెట్‌ కొలువుదీరే సమయం ఆసన్నమైంది. ప్రధాని మోదీ సహా కొత్త మంత్రులంతా ఇప్పటికే ప్రమాణం చేసేశారు. ఇక నేటి సాయంత్రం ప్రధాని నేతృత్వంలో కొత్త కేంద్ర మంత్రి వర్గం భేటీ కానుంది. సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని లోక్‌కళ్యాణ్‌ మార్గ్‌లో ఉన్న ప్రధాని నివాసంలో క్యాబినెట్‌ సమావేశం జరగనుంది. ఈ భేటీలో.. కొత్త ప్రభుత్వం వంద రోజుల కార్యాచరణపై ఆయన మంత్రివర్గ సహచరులకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. అలాగే.. స్పీకర్‌ ఎన్నిక తదితర అంశాల కోసం పార్లమెంట్‌ సమావేశం నిర్వహించాలని సిఫారస్సు చేసి.. దానిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపిచే యోచనలోనూ ఉన్నారు.

ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం రాత్రి న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రమాణస్వీకారం చేశారు. మోదీ సహా 72 మందితో కేంద్ర క్యాబినెట్‌ కూడా ఏర్పాటైంది. ప్రధాని, మంత్రులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించారు. 30 మందికి క్యాబినెట్‌ మంత్రులుగా అవకాశం లభించింది. మరో ఐదుగురిని స్వతంత్ర హోదాతో సహాయ మంత్రులుగా, 36 మందిని సహాయ మంత్రులుగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు.

- Advertisement -

శాఖ‌లు కేటాయింపు నేడే…
ఇక‌ఈ భేటీలోనే కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపుపై స్పష్టత రానుంది. భాగస్వామ్య పక్షాల ఆశిస్తున్న శాఖల అంశాన్ని పరిగణలోకి తీసుకున్న బీజేపీ.. వ్యూహాత్మక నిర్ణయంతోనే ముందుకు సాగనుంది. కీలకమైన ఆర్థిక, హోం, రక్షణ, విదేశాంగ, రైల్వే, రవాణా శాఖలను తమ దగ్గరే అంటిపెట్టుకోనుంది బీజేపీ. అలాగే.. మూడో దఫా ప్రభుత్వంలో మ్యానుఫ్యాక్చరింగ్, మౌలిక వసతులపై ప్రధాన ఫోకస్ ఉంటుందనే గతంలోనే మోదీ ప్రకటించారు. దీంతో దీని పరిధిలోకి వచ్చే శాఖలు కూడా బీజేపీ చేతిలోనే ఉండే అవకాశం కనిపిస్తోంది.

మోదీ కేబినెట్ లో 27 మంది బీసీలు..
మంత్రి వర్గ కూర్పులో ప్రధాని మోదీ కులసమీకరణాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. అలాగే.. త్వరలో ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలకూ ప్రాధాన్యం ఇచ్చారు. ఇక కొత్త మంత్రుల్లో 27 మంది బీసీలు ఉన్నారు. ఐదుగురు మైనారిటీలు, ఏడుగురు మహిళలు ఉన్నారు.

మిత్ర పక్షాల కోర్కెల చిట్టా
ఎన్డీయే భాగస్వామ్య పార్టీలు సైతం తమ తమ ప్రయోజనాల దృష్ట్యా ముఖ్య‌ శాఖల్నికోరుతున్నాయి. జేడీఎస్‌ కుమారస్వామి వ్యవసాయ శాఖ కోరింది. మరోవైపు రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకునే శాఖల్ని కోరామని మరో మిత్రపక్షం టీడీపీ ఇది వరకే ప్రకటించుకుంది. అలాగే..జేడీయూ, ఇతర పార్టీలు సైతం పలు శాఖల్ని డిమాండ్‌ చేసింది. ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్డీయే ఎంపీల సమావేశం జరుగుతున్న టైంలోనే మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో మిత్రపక్ష నేతలతో మంత్రివర్గ కూర్పు, ఎవరికి ఏయే శాఖల వంటి అంశాలపై చర్చలు జరిగి, ఓ నిర్ణయం కూడా ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసుకుంది.. దానికి అనుగుణంగా నేడు శాఖ‌లు కేటాయించ‌నున్నారు మోదీ..

తొమ్మిది బెర్త్ లు ఖాళీ
ఇది ఇలా ఉంటే మోదీ కేబినెట్ లో 72 మంది మంత్రులుండ‌గా . ఇందులో 30 మంది కెబినేట్ మంత్రులుగా, ఐదుగురికి స్వతంత్ర మంత్రులు, . 36 మంది సహాయ మంత్రులు ఉన్నారు.. ఇంకా కేంద్ర కేబినెట్‌లో 9 బెర్తులు ఖాళీగాను ఉన్నాయి.. వాటిని త్వ‌ర‌లోనే మోదీ భ‌ర్తీ చేయ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement