Saturday, May 4, 2024

MDK : బైక్‌ను ఢీకొట్టిన లారీ… అక్క‌డికక్క‌డే ఇద్ద‌రు మృతి

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం పాపన్నపేట మండలం మిన్పూర్ లో వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ అదుపుతప్పి బైక్ ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవ పరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement