Wednesday, May 15, 2024

Job Mela | ఈ నెల 30న సంగారెడ్డిలో జాబ్ మేళా..

సంగారెడ్డి జిల్లాలో పేటీఎం కంపెనీ ఆధ్వర్యంలో ఈ నెల 30న జాబ్ మేళా నిర్వహించనున్నారు. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 30న విద్యార్హత సర్టిఫికెట్లతో హాజరు కావాలని జిల్లా ఉపాధి అధికారి వందన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పేటీఎం కంపెనీలో (50)ఉద్యోగాల భర్తీకి జనవరి 30న ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు సంగారెడ్డి బైపాస్ రోడ్డులోని పాత వెలుగు ఆఫీస్ లోని జిల్లా ఉపాధి కార్యాలయ ప్రాంగణంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలని, ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ విద్యార్హతలు గల అభ్యర్థులు అర్హులని తెలిపారు. మరిన్ని వివరాలకు ఫోన్ నెంబర్ 08455-271010 లో సంప్రదించవచ్చని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement