Saturday, April 27, 2024

విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి..

విద్యుత్ షాక్ కు గురై రైతు మృతి చెందిన సంఘటన వెల్దుర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని శేరిలా గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. బంధువులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శేరీలా గ్రామానికి చెందిన గురు నాగులు(50) ఉదయం మండల పరిధిలోని చర్లపల్లి గ్రామ పంచాయతీ శివారులో గల వర్ధవాని చెరువు తాండ వద్ద వ్యవసాయ పొలాల్లో గల విద్యుత్ ట్రాన్స్ ఫార్మ‌ర్ పై తీగ బిగించడానికి ఎక్కి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ట్రాన్స్ ఫార్మ‌ర్ల‌పైనే పడి మృతి చెందాడు. నాగులుకు భార్యాపద్మ, ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నాడు. భార్య ఫిర్యాదు మేరకు వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాగులు మృతితో శేరీల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement