Friday, April 26, 2024

ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో యువకుడి దారుణ హత్య..

సంగారెడ్డి జిల్లా బొల్లారం ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో గురువారం తెల్లవారు జామున యువకుడి హత్య పారిశ్రామిక వాడ ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఓ యువకుడిని కాళ్లు చేతులు కట్టేసి అతి కిరాతకంగా దుండగులు హత్య చేసి సర్వీస్ రోడ్డుపై బాడీని వదిలివేసి వెళ్లిపోయారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు వేగవంతం చేశారు. జిల్లా కేంద్రం నుంచి డాగ్ స్క్వేడ్స్, క్లూస్ టీమ్ ను రప్పించి విచారణ చేపట్టారు. ప్రేమ వ్యవహారమా, మరింకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో యువకుడి హత్యకు గల కారణాలను అతి త్వరలో ఛేదించి హంతకులను అరెస్టు చేస్తామని సీఐ సురేందర్ రెడ్డి తెలిపారు. ఈ హత్య ఉదాంతంతో పారిశ్రామిక వాడకు చెందిన ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement