Friday, May 3, 2024

పెట్రోల్ బంకుల్లో భారీ మోసం


. పెట్రోలు పోయకుండా పోసినట్లు రీడింగ్. ప్రశ్నిస్తే దాడులకు సైతం వెనకాడని నిర్వాహకులు
. రామాయంపేట మండలం కోనాపూర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకు మోసాలు రోజురోజుకు బయట పడుతున్నాయి గతంలో పెట్రోల్ తక్కువ వస్తుందని వాహనదారులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తే ఏ మాత్రం పట్టించుకోలేదు అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఓ వీడియో హల్ చల్ చేస్తోంది వినియోగదారుడు పెట్రోల్ పోయించు కోవడానికి బాటిల్ తీసుకుని వెళ్లగా అందులో 20 రూపాయల పెట్రోల్ చేసే వరకు కూడా కనీసం ఒక్క చుక్క కూడా పెట్రోల్ ఆ బాటిల్ లో పడలేదు దీంతో ఆగ్రహించిన సదరు వ్యక్తితో పాటు ఇతర వాహనదారులు ఇదేంటని ప్రశ్నిస్తే తమకేమీ తెలియదని అవసరమైతే నీ ఇష్టం ఉన్న దగ్గర ఫిర్యాదు చేసుకోవచ్చని నిర్వాహకులు చెప్పడంతో వాహనదారులకు తీవ్ర మనోవేదనకు గురిచేసింది అంతేకాకుండా కొందరు వ్యక్తులను ఈ విషయమై ప్రశ్నిస్తే దాడులు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి ఈ విషయంలో సంబంధిత అధికారులు పట్టించుకోని వెంటనే చర్యలు తీసుకోవాలని వాహనదారులు ప్రజలు కోరుతున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement