Saturday, October 19, 2024

Medak లో ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్

మెదక్ జిల్లా కేంద్రంలో బీజేపీ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. గోవుల తరలింపు, జంతువధపై నిన్న రాత్రి మెదక్ టౌన్ లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఇరు వర్గాలను పోలీసులు లాఠీ చార్జి చేసి చెదరగొట్టారు. ఈ గొడవ నేపథ్యంలో ఇవాళ మెదక్ పట్టణం బంద్ కు బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. ప్రస్తుతం బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది.

వర్తక, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. ఇక బంద్ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. మెదక్ టౌన్ కు అదనపు బలగాలను తరలించి ప్రధాన కూడళ్లలో మోహరించారు. ఐజీ రంగనాథ్ స్వయంగా భద్రతను పర్యవేక్షించారు. ఎస్పీ బాల స్వామితో పాటు ఇతర పోలీస్ అధికారులు శాంతి భద్రతల పరిరక్షణ లో ఉన్నారు. ఎక్కడికక్కడ పోలీసు పికెట్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మెదక్ జిల్లా కేంద్రం పూర్తిగా పోలీస్ దిగ్బంధంలో ఉంది. పలువురు బీజేపీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement