Friday, May 3, 2024

హైద‌రాబాద్‌లో భారీ చోరీ.. 12.50 ల‌క్ష‌ల విలువైన బంగారు ఆభ‌ర‌ణాలు, డైమండ్స్ మాయం!

హైద‌రాబాద్‌లోని సికింద్రాబాద్‌లో భారీ చోరీ జ‌రిగింది. బోయిన్‌ప‌ల్లి పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఓ ఇంట్లో 12.50 ల‌క్ష‌ల విలువైన బంగారు ఆభ‌ర‌ణాలు, డైమండ్స్ చోరీ అయిన‌ట్టు కంప్లెయింట్ అందింది. అయితే ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా కేసు ద‌ర్యాప్తు కొన‌సాగుతోంది. కాగా, ఆ ఇంట్లో ప‌నిచేస్తున్న మ‌హిళ‌పై తొలుత అనుమానం వ్య‌క్తం చేశారు. సీసీ కెమెరాలలో నమోదై దృశ్యాల ఆధారంగా మ‌రిన్ని వివ‌రాలు సేక‌రిస్తున్నారు పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement