Thursday, May 9, 2024

Manjula Murder – క‌ళ్ల‌లో కారం జ‌ల్లి… చీర కొంగుతో ఉరివేసి… మంచం కింద శ‌వం దాచి.. ఆపై పెట్రోల్ తో ద‌హ‌నం

శంషాబాద్‌లో సంచలనం సృష్టించిన మహిళ దారుణ హత్య ఓ మ‌హిళ చేయ‌డం విశేషం.. ఈ కేసులో అస‌లు నిందిత‌రాలితో స‌హా ఆమెక స‌హ‌క‌రించిన మ‌రో ఇద్ద‌రిని పోలీసులు అరెస్ట్ చేశారు… కేవ‌లం ఇచ్చిన అప్పు ఇవ్వ‌మ‌న్న పాపానికే ఆమెను హ‌త్య చేయ‌డం మ‌రీ విషాదం.. ఈ కేసు శంషాబాద్ పోలీసులు వివ‌రించారు.. ఆర్ధిక‌ప‌ర‌మైన అంశాలే హ‌త్య‌కు కార‌ణ‌మ‌ని నిర్ధారించారు..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్‌ మండలం రాళ్లగూడకు చెందిన మంజుల కొన్నాళ్ల క్రితం రిజ్వానకు రూ.లక్ష అప్పుగా ఇచ్చారు. రెండు నెలలుగా రిజ్వాన వడ్డీ చెల్లించడం లేదు. ఈ క్రమంలో ఈ నెల 10న రిజ్వాన ఇంటికి వెళ్లిన మంజుల, ఆమె భర్త డబ్బులు తిరిగి ఇవ్వాలని గట్టిగా అడిగారు. దీంతో నిందితురాలు రిజ్వాన వారిపై కక్ష పెంచుకుంది. మరోసారి డబ్బులు తిరిగి ఇవ్వమని మంజుల అడగడంతో వారి మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. రెండు రోజుల కిందట మంజుల కడుపునొప్పి వస్తుందని శంషాబాద్‌ ఆస్పత్రికి వెళ్తున్నట్లు భర్తకు చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. తిరిగి రాకపోవడంతో ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో శంషాబాద్‌లోని శ్రీనివాస ఎన్‌క్లేవ్‌ వద్ద సగం కాలిపోయిన గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించారు.

మంజుల భర్త చెప్పిన పోలికలు, ఘటనాస్థలి వద్ద మృతదేహంతో సరిపోలడంతో హత్యకు గురైంది మంజులగా పోలీసులు నిర్ధరించారు. మంజుల మెడలో ఉన్న తాళి బొట్టు, చెవి కమ్మలు, కాళ్ల కడియాలు లేవని కుటుంబసభ్యులు గుర్తించారు. మంజుల వద్ద ఆభరణాల కోసమే హత్య చేసి ఉంటారని తొలుత పోలీసులు భావించారు. కానీ, మృతురాలి బంధువులు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. మంజుల ఒంటరిగా వెళ్లడం చూసిన రిజ్వాన కంట్లో కారం చల్లి త‌న ఇంటిలోకి లాక్క‌ని వెళ్లి చీరకొంగుతో ఉరి వేసి హత్య చేసింది. హత్య అనంతరం మంజుల ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను తీసుకుంది. అదే రోజు అర్ధరాత్రి సమయంలో మృతదేహాన్ని శంషాబాద్‌లోని శ్రీనివాస ఎన్‌క్లేవ్‌ వద్దకు తీసుకెళ్లి పెట్రోల్‌ పోసి నిప్పంటించింది… రిజ్వానకు ఇద్దరు వ్యక్తులు సహకరించినట్టు పోలీసులు వెల్లడించారు. శనివారం నిందితులను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement