Saturday, September 21, 2024

ఆటోను ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి

కరీంనగర్‌ జిల్లాలోని తిమ్మాపూర్‌ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా… పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement