Friday, May 17, 2024

RR: విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి..

వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని ఖుదావంద్ పూర్ గ్రామంలో అడవి జంతువుల రక్షణ కోసం పంటలకు వేసిన కంచెకు తగిలి వ్యక్తి మృతిచెందాడు. మృతుడు మాదారం గ్రామానికి చెందిన పోచన్న గా గుర్తించారు. అయితే మాదారం గ్రామానికి చెందిన వ్యక్తి ఇక్కడికి ఎందుకు వచ్చాడా అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కుందేళ్ళ వేటకు వచ్చి ఉంటాడని కొందరు పేర్కొంటున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement