Friday, May 3, 2024

ఆటో ద్విచక్ర వాహనం ఢీ.. ఒకరి మృతి.. ఇద్దరికి గాయాలు

ఆటో ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరు గాయపడిన సంఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి జిల్లా కేంద్రంలోని కమాన్ చౌరస్తా వద్ద జరిగిన ప్రమాదంలో ఒరిస్సాకు చెందిన వలస కూలి మృతి చెందగా మరో ఇద్దరు కూలీలు గాయపడ్డారు. ద్విచక్ర వాహన దారుడికి స్వల్పగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్ఐ లు రాజేష్, రజావర్దన్ లు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement