Friday, May 3, 2024

Mallareddy – వచ్చే ఎన్నికలలో పోటీ చేయను – కారు నుంచి దిగను

పార్టీ మార్పు ప్రచారంపై స్పందించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. కాంగ్రెస్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను కలిశారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన క్లారిటీ ఇచ్చారు.

పార్టీ మారుతున్నానన్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు మల్లారెడ్డి. వ్యాపార లావాదేవీల నిమిత్తమే డీకే శివకుమార్‌ను కలిసినట్లు వివరణ ఇచ్చారు. తన మిత్రుడికి సంబంధించిన యూనివర్సిటీ కొనుగోలు కోసం మాట్లాడేందుకు వెళ్లినట్లు తెలిపారు. అది కూడా ఓ మధ్య వర్తి ద్వారానే కలిసినట్లు తెలిపారు.

అంతకముందు డీకే శివకుమార్‌ను కలిసిన మల్లారెడ్డి ఆయన కుమారుడు, అల్లుడు కాంగ్రెస్‌లో చేరుతున్నారనే ప్రచారం జరిగింది. దీంతో తాను బీఆర్ఎస్‌లోనే ఉంటానని, ఎమ్మెల్యేగా కొనసాగుతూ ప్రజలకు సేవ చేస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతం తన వయస్సు డెబ్బైయొక ఏళ్లన్న మల్లారెడ్డి.. వచ్చే అసెంబ్లీ ఎన్ని్కల్లో పోటీ చేయడంలేదని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement