Tuesday, July 23, 2024

TS: 26న కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలి.. మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి ప్రతినిధి, అక్టోబర్ 21(ప్రభ న్యూస్): ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 26న జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించే కేసీఆర్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. జన సమీకరణ కోసం గ్రామాలు మండలాలు మున్సిపాలిటీలలో వార్డుల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలను సమాయత్తం చేయాలని కోరారు.

గ్రామాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటి ప్రచారం చేస్తూ ప్రజలను బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించడంతో పాటు కేసీఆర్ సభకు అధిక సంఖ్యలో తరలివచ్చే విధంగా కృషి చేయాలని కోరారు. సభ విజయవంతానికి ప్రతి ఒక్కరూ క్రియాశీలక పాత్ర వహించాలని, అలాగే నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement