Sunday, April 28, 2024

TS : ఇంటర్ పరీక్షా కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

మక్తల్, మార్చి2(ప్రభన్యూస్) : ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల సందర్భంగా ఇవాళ మక్తల్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో ఇంటర్ ఫస్టియర్ సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష కొనసాగుతోంది.

పరీక్షా కేంద్రంలో ఆయన పరీక్షలు కొనసాగుతున్న విధానాన్ని పరిశీలించారు .ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ తో మాట్లాడారు. ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కోరారు. కలెక్టర్ వెంబడి స్థానిక తహశీల్దార్ సువర్ణ రాజ్ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement