Sunday, May 5, 2024

క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభం..

గద్వాల : నియోజకవర్గంలో గద్వాల మండలంలోని పూడూరు , ఎర్రవల్లి గ్రామంలోని ఎర్రవల్లి గ్రామ యూత్‌ ఆధ్వర్యంలో క్రికెట్‌ టోర్నమెంట్‌ ను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బ్యాటింగ్‌ చేసి క్రికెట్‌ పోటీలను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… యువత విద్యతో పాటు క్రీడా రంగంలో మంచి నైపుణ్యత పొంది క్రీడా రంగంలో కూడా రాణించాలి. గ్రామీణ ప్రాంత క్రీడలు ప్రతి ఒక్క క్రీడాకారులు చక్కటి ప్రదర్శన ఇచ్చి గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు మీ ప్రదర్శనలు తీయాలని , భవిష్యత్తులో ఇలా రంగంలో అత్యున్నత స్థాయికి ఎదిగి గద్వాల ప్రాంతానికి కూడా మంచి పేరు వచ్చే విధంగా కృషి చేయాలని తెలిపారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమే , ఓడిపోయినా నిరుత్సాహం పడకూడదు. గెలిచాము అని గర్వపడవద్దు. స్నేహపూర్వకంగా క్రీడలను ఆడాలి. ఓడిపోయినా ఓటమి వజయానికి నాందిగా భావించాలి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ప్రతాప్‌ గౌడ్‌ , జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు మజీద్‌ , సర్పంచ్‌లు సత్యరెడ్డి, వాసు, ఎంపిటిసి శంకర్‌ గౌడ్‌ , తెరాస పార్టీ అధ్యక్షుడు రమేష్‌ నాయుడు , తెరాస పార్టీ నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement