Thursday, May 2, 2024

జాతీయ రహదారిపై బైఠాయించిన సిఐటియు నాయకులు..

మహబూబ్‌నగర్‌ : బాలానగర్‌ మండల కేంద్రంలో భారత్‌ బంద్‌లో భాగంగా సిఐటియు నాయకులు జాతీయ రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. అనంతరం జిల్లా నాయకులు దీప్‌లా నాయక్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అన్ని వ్యవస్థలను ప్రైవేట్‌ పరం చేస్తుందని ఆయన అన్నారు. గత కొన్ని రోజులుగా రైతులు ఢిల్లీలో ధర్నాలు చేస్తుంటే కేంద్ర ప్రబుత్వం కనీసం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు సిఐటియు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement