Sunday, April 28, 2024

MBNR : వీధి కుక్క‌ల దాడిలో… 60గొర్రెలు మృతి

మక్తల్, ఏప్రిల్14(ప్రభన్యూస్) : గొర్రెల మంద‌పై వీధి కుక్క‌లు దాడికి పాల్ప‌డ్డాయి. ఈ దాడిలో 60గొర్రెలు మృతి చెందాయి. ఈ ఘ‌ట‌న నారాయ‌ణ‌పేట జిల్లా మ‌క్తల్‌లో చోటుచేసుకుంది.

ప్రతి రోజు మాదిరిగా ముష్టిపల్లి గ్రామానికి చెందిన కుర్వ యాంకి రాజు తన గొర్రెలను గ్రామ శివారులోని ఓ రైతు పొలంలో ఉన్న కొట్టంలో రాత్రి ఉంచాడు. అర్థరాత్రి అనంతరం వీధి కుక్కలు గొర్రెల మందపై దాడి చేశాయి. ఇవాళ ఉదయం గొర్రెల మంద వద్దకు వెళ్ళిన కుర్వ యాంకి రాజుకు గొర్రెలు చనిపోయి ఉండడం కనిపించి బోరుమన్నాడు. సుమారు రూ .3 లక్షల నష్టం వాటిల్లినట్లుబాధితుడు తెలిపాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement