Sunday, April 28, 2024

TS: మ‌ధిర ప్ర‌జ‌లే న‌న్ను ఈ స్థాయికి తెచ్చారు.. కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన‌ ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి ..

మ‌ధిర – త‌న‌ను ఈ స్థాయిలో ఉంచింది మధిర నియోజకవర్గ ప్రజలే అని డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండల సీతారాంపురంలో ఇవాళ జ‌రిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో చెప్పిందే చేస్తాం చేయగలిగేదే చెప్తామన్నారు. త‌నను ఈ స్థాయిలో ఉంచింది మధిర నియోజకవర్గ ప్రజలు, సీతారాంపురం గ్రామస్థులు చల్లగా ఉండాలన్నారు.

కాగా, అభివృద్ధి పనుల్లో నాణ్య‌త పాటించాల‌న్నారు. పనుల విషయంలో అధికారులు పర్యవేక్షణ తప్పని సరని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారెంటీలు తప్పక అమలు చేసి తీరుతామన్నారు. రాష్ట్రంలో పేదలకు 2వందల యూనిట్లు విద్యుత్, 5 వందలకే గ్యాస్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప‌థ‌కాలు ఇప్ప‌టికే అమ‌లు చేస్తున్నామ‌న్నారు. మధిర నియోజకవర్గ ప్రజల ఓటుకు గౌరవం తెచ్చే విధంగా పనిచేస్తామన్నారు. ఉద్యోగులను గత ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసింద‌ని, తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం వారిని తిరిగి అదుకుంటుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement