Tuesday, May 21, 2024

ఫైనాన్స్ కట్టలేక లారీ యజమని ఆత్మహత్య

లారీకి తెచ్చిన అప్పు కట్టలేక యజమాని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జయశంకర్ జిల్లా భూపాలపల్లి మండలం మోరంచపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.  మొరంచపల్లికి చెందిన నరెడ్ల సుధాకర్ రెడ్డి(34) ఫైనాన్స్ లో లారీ కొనుగోలు చేశారు. అయితే, ఫైనాన్స్ కట్టలేక, అప్పుల బాధ తాళలేక ప్రధాన రహదారి కొత్తపెల్లి దారిలో ఆగి ఉన్న తన లారీకి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సుధాకర్ రెడ్డి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement