Friday, April 26, 2024

Breaking: ములుగు జిల్లాలో పిడుగుపాటు.. బందాల గ్రామావాసికి తీవ్ర గాయాలు

తెలంగాణ రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో వాతావ‌ర‌ణం మారింది. ఈదురుగాలులు, ఉరుములు మెరుపుల‌తో జ‌ల్లులు కురుస్తున్నాయి. కాగా, ఇవ్వాల రాత్రి ములుగు జిల్లాలోని అట‌వీ ప్రాంతంలో పిడుగుప‌డింది. దీంతో తాడ్వాయి మండ‌లం బందాల గ్రామానికి చెందిన నాలి బుయ్య‌పై ఈ పిడుగు ప‌డ‌డంతో తీవ్ర గాయాల‌య్యాయి. వెంట‌నే అక్క‌డి నుంచి ములుగు ఏరియా ఆస్ప‌త్రికి ఆయ‌న‌ను చికిత్స కోసం త‌ర‌లించారు. ప్ర‌స్తుతం ఎలాంటి ప్రాణ‌హాని లేద‌ని, కోలుకుంటున్నాడ‌ని ఆస్ప‌త్రి వ‌ర్గాలు తెలిపాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement