Wednesday, May 1, 2024

LB Nagar – ప్రతిపక్షాల మాయమాటలు నమ్మి మోస పోవద్దు: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

నాగోల్ నవంబర్ 12(ఫ్రభ న్యూస్) ఎన్నికల ప్రచారంలో భాగంగా అదివారం ఉదయంఫత్తుల్లా గూడ సర్వ నెంబర్ 58లో స్థానిక ఎమ్మెల్యే భారాస అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గడగడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా హరిజన బస్తీ భారతీయ జనతా పార్టీ కి చెందిన యువకులు భారీ గా ఎమ్మెల్యే సమక్షంలో బిఆర్ఎస్ లోకి చేరారు. ఈ సందర్బంగా యువకులు మాట్లాడుతూ ఎల్బీ నగర్ అభివృద్ధి ప్రధాత సుధీర్ రెడ్డి అనే సత్యం గ్రహించి మళ్లీ సుధీర్ రెడ్డినే గెలుపించుకోవాలనే ఉద్దేశ్యంతో బిఆర్ఎస్ లో చేరామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఫత్తుల్లాగూడ ప్రజలు,మహిళలు,బతుకమ్మ, బోనాలతో ఎమ్మెల్యే కు స్వాగతం పలికి బ్రహ్మరథ పెట్టారు. అనంతరం ఫత్తుల్లాగూడ మైనారిటీ ప్రజలు బిఆర్ఎస్ పార్టీకి పూర్తి మద్దతును ప్రకటించారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఎల్బీనగర్ అభివృద్ది మీ కళ్ల ముందు కనబడుతుందని రాష్ట్రం కేసిఆర్ పాలనలో సుభిక్షంగా ఉందని పేర్కొన్నారు.మాయమాటలు చెప్పే ప్రతిపక్షాల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. మళ్లీ ఎమ్మెల్యేగా అవకావం ఇస్తే ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని దేశం లోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని వాగ్దానం చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ చెరుకు సంగీత ప్రశాంత్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు తూర్పాటి చిరంజీవి, పార్టీ సినియర్ నాయకులు అనంతుల రామిరెడ్డి తదితరులు భారీగా పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement