Friday, May 3, 2024

అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలి – ఎమ్మెల్యే కూసుకుంట

చౌటుప్పల్, ఆగస్టు 26 (ప్రభ న్యూస్) : ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలోని వివిధ వార్డులలో చేపట్టిన సిసి రోడ్లు, డ్రైనేజీలు తదితర అభివృద్ధి పనులను శనివారం ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం, వార్డులు, గ్రామాల అభివృద్ధి కోసం ఎన్ని నిధులు అయినా ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అధికారంలో ఉన్నందున మునుగోడు నియోజకవర్గంలోని అన్ని మండలాలలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నియోజకవర్గం అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తాను నిరంతరం పనిచేస్తున్నట్టుగా ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు కూడా అండగా నిలబడాలని ఎమ్మెల్యే కోరారు.

ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, బి ఆర్ ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు ముత్యాల ప్రభాకర్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ ఊడుగు మల్లేశం గౌడ్, శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి, కౌన్సిలర్లు ఆలే నాగరాజు, బండమీది మల్లేశం, షాది ఖానా చైర్మన్ ఎండి ఖలీల్, నాయకులు బొడిగె బాలకృష్ణ, తాడూరి పరమేష్, ఊడుగు రమేష్ గౌడ్, పస్తం గంగారాములు, పోలోజు శ్రీనివాసాచారి, బొమ్మిరెడ్డి వెంకట్ రెడ్డి, వీసం చంద్రారెడ్డి, ఎమ్మెస్ గౌడ్, బత్తుల స్వామి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement