Saturday, July 27, 2024

KTR : మంత్రి వేములను పరామర్శించిన కేటీఆర్‌

వేల్పూర్‌: ఏడాది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాతృమూర్తి వేముల మంజులమ్మ (77) ఈ నెల 12న హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ దవాఖానలో కన్నుమూసిన విషయం తెలిసిందే. మాతృవియోగంతో బాధలో ఉన్న మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డిని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ పరామర్శించారు. నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌లోని ఆయన నివాసానికి చేరుకున్న మంత్రి కేటీఆర్‌.. మంజులమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వేముల కుటుంబ సభ్యులను ఓదార్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement