Monday, April 29, 2024

నేడు సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన – షెడ్యూల్…

 రాజన్న సిరిసిల్ల, : రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఆయనతో పాటు ఇద్దరు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

మధ్యాహ్నం 2 గంటలకు సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్‌ బైపాస్‌రోడ్డులో ఏర్పాటు చేసిన పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు పద్మనాయక కల్యాణ మండపంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభలో ప్రజలనుద్ధేశించి ప్రసంగించనున్నారు. సాయంత్రం 4 గంటలకు మానేరు బ్రిడ్జి వద్ద బోటు షికారును ప్రారంభిస్తారు. సాయంత్రం 5 గంటలకు బైపాస్‌రోడ్డులో కొత్తగా నిర్మించిన కే కన్వెన్షన్‌ సెంటర్‌ను ప్రారంభిస్తారు. అనంతరం జిల్లా ఏరియా దవాఖానకు చేరుకుని 40కేవీ రూప్‌టాప్‌ సోలార్‌ ప్లాంట్‌ను, 130 అదనపు బెడ్స్‌, క్యాన్సర్‌ బాధితుల కోసం కీమోథెరఫీ డేకేర్‌ సెంటర్‌ను ప్రారంభిస్తారు

Advertisement

తాజా వార్తలు

Advertisement