Saturday, May 4, 2024

నేడు సిద్దిపేట, హనుమకొండ జిల్లాలో కేటీఆర్ పర్యటన

ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌తో పాటు హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నారు. రెండు జిల్లాల్లో కలిపి దాదాపు రూ.214.51 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. హుస్నాబాద్‌ పట్టణంలో ఉదయం 10 నుంచి 11.25 గంటల వరకు రూ.33.51 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఉదయం 11.35 గంటలకు డిపో గ్రౌండ్‌లో భారీ బహిరంగసభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు భోజ నం, 2.30 గంటలకు హుస్నాబాద్‌ నుంచి హనుమకొండ పర్యటనకు వెళ్తారు.

కాగా, వరంగల్ జిల్లాలో కేటీఆర్ పర్యటన నేపథ్యంలో పలువురు విద్యార్థి నేతలతో పాటు బీజేపీ నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు. AIYF రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ వలితో పాటు బీజేపీ నేత గొర్రె ఓం ప్రకాశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement