Monday, April 29, 2024

వరంగల్ జిల్లా బీఆర్ ఎస్ కార్యాలయానికి కేటీఆర్ శంఖుస్థాపన

(వరంగల్ ప్రభన్యూస్ ప్రతినిధి) భారత రాష్ర్ట సమితి వరంగల్ జిల్లా కార్యాలయానికి రాష్ట్ర పురపాలక,ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శుక్రవారం రాత్రి శంఖుస్థాపన చేశారు.వరంగల్ నగరంలోని నాయుడు పెట్రోల్ బంక్ ప్రాంతంలో నిర్మించనున్న పార్టీ కార్యాలయానికి మంత్రి కేటీఆర్. సాయంత్రం ఐదు గంటలకే శంఖుస్థాపన చేయాల్సి ఉంది. నగరంలో వివిధ కార్యక్రమాల్లో బిజీ కారణంగా రాత్రి 8:50 నిమిషాలకు శంఖుస్థాపన చేశారు.తూర్పు శాసనసభ్యుడు నన్నపనేని.నరేంధర్ ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.

ఈకార్యక్రమంలో మంత్రి కేటీఆర్ వెంట మంత్రులు దయాకర్ రావు,సత్యవతి రాథోడ్,ప్రభుత్వం చీఫ్ విప్ వినయభాస్కర్ శాసనమండలి వైస్ ఛైర్మన్ బండా ప్రకాష్,యంపీ లు దయాకర్,కవిత,శాసనమండలి సభ్యులు కడియం శ్రీహరి,పల్లా రాజేశ్వర్ రెడ్డి,పోచంపల్లి.శ్రీనివాస్ రెడ్డి,బస్వరాజు సారయ్య,రవీందర్ రావు,కౌశిక్ రెడ్డి,నగర మేయర్ గుండు.సుధారాణి శాసనసభ్యులు ఆరూరి రమేష్,నన్నపనేని నరేందర్ ,పెద్ది.సుదర్శన్ రెడ్డీ,చల్లా.ధర్మారెడ్డి,డాక్టర్ రాజయ్య,శంకర్ నాయక్,యాదగిరి రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement