Sunday, May 5, 2024

భూదాన్ పోచంపల్లిలో హ్యాండ్లూమ్ పార్క్ కు కేటీఆర్ శంకుస్థాపన

ప్రభన్యూస్, ప్రతినిధి/యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి పట్టణ, మండల కేంద్రంలోని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పర్యటించి పలు అభివృద్ధి పథకాలకు శంఖుస్థాపన చేశారు.మండల కేంద్రంలో కాలాపునర్వి హ్యాండ్లూమ్ పార్క్ కు శంఖుస్థాపన చేశారు. మంత్రి కేటీఆర్ వెంట గుంటకండ్ల జగదీష్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు.

సుక్క పావనికి మొదటి గృహాలక్ష్మి..

పోచంపల్లి పర్యటనలో భాగంగా రాష్ట్ర ఐటి, పురపాలక మంత్రి కేటీఆర్ పలు కార్యక్రమాలు నిర్వహిస్తుండగా పోచంపల్లి మండలం కనుముక్కల గ్రామానికి చెందిన ఎస్సి వర్గానికి చెందిన సుక్క పావనికి జిల్లాలో మొదటి గృహాలక్ష్మి పథకాన్ని అందజేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement