Monday, May 6, 2024

WGL: గట్టమ్మ తల్లిని దర్శించుకున్న మంత్రులు కొండా సురేఖ, సీతక్క…

ప్రభ న్యూస్ ప్రతినిధి, ములుగు: ములుగు జిల్లా సమీపంలో ఉన్న గట్టమ్మ తల్లిని బుధవారం రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర పంచాయతీ రాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క దర్శించుకున్నారు. ములుగు జిల్లాకు మొదటిసారిగా వచ్చిన మంత్రి సురేఖ కు పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి సంస్థ & మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్వాగతం పలికారు.

మేడారం మహా జాతరలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని తల్లిని కోరుకున్నారు. మొదటి సారి మంత్రి హోదాలో ములుగు జిల్లాకు రావడం గట్టమ్మ తల్లిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని మంత్రి కొండా సురేఖ అన్నారు. వారితో పాటు జిల్లా ఎస్ పి శబరిష్, డి ఎఫ్ ఓ రాహుల్ కిషన్ జాదవ్, ఆర్ డి ఓ సత్య పాల్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement