Friday, May 3, 2024

పార్టీ మారుతున్న‌వార్త‌ల‌పై కోమ‌టిరెడ్డి ఫైర్ ..

న్యూఢిల్లీ – తాను పార్టీ మారుతున్నానంటూ వ‌స్తున్న వార్త‌ల‌ను భువ‌న‌గిరి ఎంపి కోమటిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ఖండించారు.. కొన్ని వెబ్ సైట్స్లోనూ, ఎలాక్ర్టినిక్ మీడియాలోనే ఆయ‌న కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన‌ట్లు క‌థ‌నాలు నేటి ఉద‌యం వెలువ‌డ్డాయి.. అయితే ఆ వార్త‌ల‌పై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ, తప్పుడు ప్రచారం చేయొద్దు.. నాది కాంగ్రెస్ రక్తం.. అంటూ పేర్కొన్నారు..
నేను పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తలను నమ్మవద్దని తెలిపారు. మీడియా సంస్థలు ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను అధికారికంగా ప్రకటించేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. నేను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నాననడం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న రాహుల్ గాంధీని అనర్హతను నిరసిస్తూ గాంధీభవన్ లో చేసిన దీక్షలో పాల్గొన్నా అని స్పష్టం చేశారు. బుధ‌వారం సైతం సోనియా గాంధీ వెన్నంటే ఉన్నాన‌ని తెలిపారు.. అలాగే భువనగిరి నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు పాల్గొంటున్నానని, నా ముందు ఎలాంటి ఆప్షన్స్ లేవ‌ని.. నాది కాంగ్రెస్ రక్తమని కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement