Sunday, April 28, 2024

Revanth : ఐదేళ్లలో కొడంగల్ అభివృద్ది జ‌రిగిందా..? టీపీసీసీ చీఫ్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యే ఒక్కసారైనా కొడంగల్‌ అభివృద్ధి గురించి మాట్లాడారా? ఈ ఐదేళ్లలో కొడంగల్‌ నియోజకవర్గానికి ఏమైనా అభివృద్ధి జరిగిందా అని టీపీసీసీ చీఫ్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. సోమ‌వారం కొడంగల్‌లో నామినేషన్ వేయడానికి రేవంత్ రెడ్డి కార్యకర్తలతో కలిసి వెళ్లారు. బీఆర్ఎస్ తల పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

ఎన్నికల్లో ఓడిపోతే కొడంగల్ ప్రజల జీవితాలు నాశనం అవుతాయని ఉద్ఘాటించారు. ఈ ఎన్నికలు కొడంగల్ ప్రజలకు కేసీఆర్ మధ్య జరుగుతున్నాయని అన్నారు. ఈ ఎన్నికలు కొడంగల్ ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడుతాయని అన్నారు. కొడంగల్ ఎమ్మెల్యే ఎప్పుడైన అధ్యక్షా అని ఈ ప్రాంత సమస్యలను అడిగిండా అని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement