Monday, April 29, 2024

BJP ఎమ్మెల్యేలను సత్కరించిన కిష‌న్‌రెడ్డి …

ఉత్కంఠగా సాగిన అసెంబ్లీ ఎన్నికల పోరులో భారీ మెజా ర్టీతో విజయం సాధించిన బిజెపి ఎమ్మెల్యేలను హైదరా బాద్ లో బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు. శుక్రవారం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార మహోత్సవంలో భాగంగా ఎన్నికల్లో విజయం సాధించిన బిజెపి ఎమ్మెల్యేలు రాష్ట్ర అధ్య క్షులు కిషన్ రెడ్డి ని రాష్ట్ర కార్యాలయంలో మర్యాదపూ ర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలను కిషన్ రెడ్డి సన్మానించారు. సత్కారం పొందిన ఎమ్మేల్యే లో రాజాసింగ్, దన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేష్ రెడ్డి, కాటిపల్లి వెంక టరమణ రెడ్డి, పాల్వాయి హరీ ష్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాయ ల్ శంకర్, రామారావు పటేల్ లు ఉన్నారు..

అనంతరం రాష్ట్ర కార్యాలయం నుంచి నేరుగా భాగ్యలక్ష్మి అమ్మవారి ని దర్శించుకోని ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత అంబేద్కర్ విగ్రహా నికి పూలమాల వేసి గన్ పార్క్ లో గల అమరవీరుల స్తూపనికి నివాళులు అర్పించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమిందర్ రెడ్డిలు పాల్గొన్నారు. కాగా ప్రొటెమ్ స్పీకర్ గా అక్బరుద్దీన్ ఎంపికను నిరసిస్తూ బిజెపి ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బహిష్కరించారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement