Monday, April 29, 2024

HYD: చీపురు ప‌ట్టి… అమ్మ‌వారి ఆల‌యాన్ని క్లీన్ చేసిన కిష‌న్ రెడ్డి…

హైదరాబాద్ లోని బషీర్ బాగ్ అమ్మవారి ఆలయంలో స్వచ్ఛత కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఇవాళ ఉదయం ఈ కార్యక్రమం నిర్వహించారు. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయాలు, పుణ్యక్షేత్రాలలో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలని ప్రధాని మోడీ ఇచ్చిన‌ పిలుపు మేరకు బషీర్ బాగ్ అమ్మవారి ఆలయంలో కిషన్ రెడ్డి ఆలయాల స్వచ్ఛత కార్యక్రమం చేపట్టారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ… ఈ నెల 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరగబోతోందని వెల్లడించారు. హిందువుల 500ఏళ్లు ఆకాంక్ష నెరవేరబోతోందని పేర్కొన్నారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం దేశంలోని కోట్ల మంది హిందువులు వేయి కన్నులతో ఎదరుచూస్తున్నారని తెలిపారు. అదేవిధంగా దేశంలోని ప్రజలంతా స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలో పాల్గొని పుణ్యక్షేత్రాలను శుభ్రం చేయాలంటూ ప్రధాని మోడీ పిలుపునిచ్చారని గుర్తు చేశారు. కులమతాలు, వర్గాలకు అతీతంగా.. స్వచ్ఛ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement