Sunday, May 5, 2024

Kidnap – మాక్లూర్ ఎంపీటీసీ-2 కిడ్నాప్ … సిపికి బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు..

నిజామాబాద్ సిటీ, డిసెంబర్ (ప్రభ న్యూస్)15: నిజామాబాద్ జిల్లాలో మాక్లూర్ మండల కేంద్రంలోని ఎంపీటీసి-2 కిడ్నాప్ కు గురికావడం కలకలం రేపు తోంది. మాక్లూర్ మండలానికి చెందిన ఎంపీటీసీ-2 మీరాబాయి ఈనెల 10న కిడ్నాప్ కు గురైందని, మీరాబాయి కుటుంబ సభ్యులు పలువురుపై అనుమానం వ్యక్తం చేస్తూ మాక్లూ ర్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ గురై ఆరు రోజులైనా మీరాబాయి ఆచూకీ దొరకకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు, శుక్రవారం నగరంలోని సీపీ కార్యాల యానికి వచ్చి ఫిర్యాదు చేశారు. కార్యాలయంలో సంబంధిత అధికారికి వినతి పత్రం సమర్పించారు.

అనంతరం మీరాబాయి భర్త నారాయణ మాట్లాడారు… ఈ నెల 10న ఎంపీపీ మరికొందరు తన నివాసానికి వచ్చి త‌న‌ భార్య మీరాబాయిని కిడ్నాప్ చేశారని ఆరోపించారు. ఈ విషయమై మాక్లూర్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసిన ఇప్పటివరకు ఎవరూ పట్టించుకోవడంలేదని వాపోయారు. సాయంత్రం వరకు ఎంపీటీసీ 2 మీరాబాయిని తీసుకురాకపోతే కుటుంబమంతా ఆత్మహత్య యత్నానికి పాల్పడతామని హెచ్చరించారు. త‌న‌ భార్య ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ అధికారులు వెంటనే స్పందించి కిడ్నాప్ పై విచారణ చేపట్టి వారి చెర నుంచి ఎంపీటీసీ 2 మీరాబాయిని తీసుకురావాలని కోరారు.

ఎంపిటిసి _2 మీరాబాయిని వదిలిపెట్టకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు చేస్తాం

ఎంపిటిసి మీరాబాయిని వదిలిపెట్టకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని ఎంపీటీసీల జిల్లా అధ్యక్షులు కోటగిరి లక్ష్మీ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఓ ప్రజా ప్రతినిధిని ఇలా కిడ్నాప్ చేయడం సరికాదు అన్నారు. వెంటనే బాధ్యులైన ఎంపీపీ ప్రభాకర్, రంజిత్, వైస్ ఎంపీపీ భర్త సుక్కి సుధాకర్, డ్రైవర్ బక్క శ్రీనులపై కిడ్నాప్ కేసుతోపాటు, అట్రాసిటీ కేసు నమోదు చేసి, వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement